ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ, బైపాస్ రహదారుల నిర్మాణం, కొత్త హైవేల రాకతో పట్టణం దశ మారిందని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్నగర్-చించోలి రోడ్డు బైపాస్ రహదారి పనులకు సంబంధించి భూమిపూజ చేశారు. మహబూబ్నగర్ జిల్లా గతంలో నిర్లక్ష్యానికి గురైందని ప్రస్తుతం అభివృద్ధిలో నెంబర్ వన్గా మారిందన్నారు. రహదారుల విస్తరణ, బైపాస్ రహదారుల నిర్మాణంతో పట్టణంలో భూములు, ఆస్తుల విలువలు ఊహించని విధంగా పెరిగిపోయాయన్నారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మహబూబ్నగర్-రాయిచూరు బైపాస్ రహదారి, మహబూబ్నగర్ – చించోలి బైపాస్ రహదారిని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, శ్రీరామ లాండ్ మార్క్ ఎండీ బెక్కరి రామిరెడ్డి, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.