వికారాబాద్, జనవరి 24 : బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీడబ్ల్యూవో లలితకుమారి తెలిపారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లిలో యజ్ఞ ఫౌండేషన్ బాలికల ఆశ్రమంలో వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం, బాలిక విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటేశ్వరమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది లక్ష్మణ్, రియాజుద్దీన్, సఖి, అనితారెడ్డి పాల్గొన్నారు.
విద్యతోనే హక్కుల సమానత్వం సాధ్యం
ధారూరు, జనవరి 24 : ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు, సమానవత్వం సాధ్యమని వికారాబాద్ సీడీపీవో వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. సోమవారం ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామంలో చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్స వాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో బాలికలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ.. ప్రతి నెలా మూడో శనివారం గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, ఉపాధ్యాయుడు సురేందర్రెడ్డి, చైల్డ్ లైన్ ప్రతినిధులు యాదయ్య, సంజమ్మ, అంగన్వాడీ టీచర్లు అరుణ, వినోద పాల్గొన్నారు.
1098, 100 సేవలను ఉపయోగించుకోవాలి
కొడంగల్, జనవరి 23 : స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చైల్డ్లైన్ ఆధ్వ ర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీ డీఎస్, పోలీసు సిబ్బంది బాలికలకు హక్కులు, బాధ్యతలు, సమాజంలో ఏవిధంగా మస లుకోవాలనే అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసు ఐశ్వర్య, పాఠశాల హెచ్ఎం ప్రసన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతీదేవి మాట్లాడుతూ.. బాలికల సంరక్షణలో భాగంగా ప్రభుత్వం చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో 1098ను ప్రవేశపెట్టిందని, బాలికలకు ఎటువంటి ఆపద ఏర్పడినా 1098, 100కు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత సిబ్బంది సాయాన్ని, న్యాయాన్ని పొందవచ్చన్నారు.