చివ్వెంల, నవంబర్ 23 : సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని ఎస్పీ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాకేంద్రం లో గల బాలికల వసతి గృహం(ఓల్డ్), కళాశాలతో పాటు చివ్వెంల మండలం బండమీది చందుపట్ల బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం ఆమె తనిఖీ చేశారు. హాస్టళ్లలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి నిధుల కొరత లేదని కృషియల్ స్కీం ద్వారా చేపట్టిన శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లయ్ మరమ్మతు పనులు పరిశీలించి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ఉండరాదని, హాజరు శాతం ఇంకా పెరుగాలని, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు దీటుగా నాణ్యమైన విధ్యను అందించాలన్నారు. వసతి గృహంలో ఉన్న ఇతర పనులకు మరో రూ. 15 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి దయానందరాణి, హెచ్డబ్ల్యూఓ వాణి, సిబ్బంది ఉన్నారు.