మొదటి దశలో 9,212 ఎకరాలు అందుబాటులోకి..
కందుకూరు,యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో 18,304 ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణం
వేగంగా జరుగుతున్న పనులు
దాదాపు పూర్తైన రహదారుల నిర్మాణం
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన
ఇప్పటికే పూర్తైన 12 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ
జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల నుంచి ఏటా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు
5.60 లక్షల మందికి ఉపాధి
ఇప్పటికే ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా కల్పించిన కేంద్రం
రంగారెడ్డి, జనవరి 23, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో నిర్మితమవుతున్న ఔషధనగరిని వచ్చేనెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలోని 18,304 ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిస్తుండగా.. మొదటగా 9,212 ఎకరాల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. మౌలిక సదుపాయాల కల్పన పనులను టీఎస్ఐఐసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 6,719 ఎకరాల్లో రహదారులు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తయింది. ఫార్మాసిటీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 5.60 లక్షల మందికి, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభించనున్నది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ ఔషధ సంస్థల నుంచి రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏడాదికి రూ.58 వేల కోట్ల ఎగుమతులు కానున్నాయి. ఫార్మాసిటీ నిర్మాణానికి రూ.16,784 కోట్లు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్(జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం)హోదా కూడా కల్పించింది. ఫార్మాసిటీ అంతా కాలుష్యరహితంగా ఉండేలా ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తుండడంతో ప్రపంచ ఔషధ దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే స్థలాల కేటాయింపును కోరుతూ 500 ఫార్మా సంస్థలతోపాటు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే మొదటి దశలో 400 కంపెనీలకు స్థలాలను కేటాయించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ వచ్చే నెల లో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే మొదటి దశ లో 9,212 ఎకరాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ప్ర మాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పించడంతోపాటు పూర్తి కాలుష్యరహితంగా, ఎకో పద్ధ్దతిలో ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నారు. అయితే మౌలిక వసతుల కల్పనలో భాగంగా 6,719 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, డ్రైనేజీ తదితర పనులు పూర్తయ్యా యి. ఇప్పటికే నిమ్జ్ హోదా పొందిన ఫార్మాసిటీ పనులు పూర్తయితే జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల నుంచి భారీగా పెట్టుబడులు రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా 5.60 లక్షల మం దికి, పరోక్షంగా అధిక సంఖ్యలో యువత, ప్ర జలకు ఉపాధి లభించనుంది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తా ల్ మండలాల పరిధిలోని 18,304 ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మించనున్నారు. వీటిలో 10,200 ఎకరాలు పట్టా భూములుకాగా, మిగతావి ప్రభుత్వ భూములు. మరోవైపు సం బంధిత భూముల్లో ఇప్పటివరకు 12వేల ఎకరాల భూముల సేకరణ పూర్తయ్యింది.
రూ.64 వేల కోట్ల పెట్టుబడులు
కాలుష్య రహితంగా, అత్యాధునిక ప్రమాణాలతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో ఫార్మాసిటీని ఏర్పా టు చేస్తున్నారు. నిర్మాణానికి రూ.16,784 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వే యగా.. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీ య, అంతర్జాతీయ ఔషధ సంస్థలు ముందుకొస్తున్నాయి. మొదటి దశలో ఫార్మాసిటీ అం దుబాటులోకి వస్తే రూ.64వేల కోట్ల పెట్టుబడులు జాతీయ, అంతర్జాతీయ ఔషధ సంస్థల నుంచి రానున్నాయి. అంతేకాకుండా ఏడాదికి రూ.58 వేల కోట్ల ఎగుమతులు జరుగనున్నా యి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణం పూర్తికాగా, వీధి దీపాలు, నీటి సౌక ర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, వాననీటి పారుదలకు ప్రత్యేక కాలువలు, టెలికాం, డేటా తదితర వసతుల పనులను చేపట్టనున్నా రు. ఫార్మాసిటీకి సరిపడా నీటిని మిషన్ భగీరథ నుంచి అందించనున్నారు. అదేవిధంగా వ్యర్థ్ధాల నిర్వహణ ప్లాంట్లను కూడా నిర్మిస్తున్నారు. ఫార్మాసిటీ అభివృద్ధికి రూ.16,784 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అదేవిధంగా ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్(జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం)హోదాను ఇప్పటికే కల్పించిం ది. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 4,922 కోట్లను కేటాయించాలని రాష్ట్ర ప్ర భుత్వం కేంద్రాన్ని కోరుతున్నది. వచ్చే బడ్జెట్ లో రూ.870 కోట్లను కేటాయించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే కేంద్ర మం త్రి పీయూశ్గోయల్కు లేఖ కూడా రాశారు.
జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల క్యూ
ఫార్మాసిటీకి ఇప్పటికే పర్యావరణంతోపాటు అన్ని రకాల అనుమతులొచ్చాయి. నిమ్జ్ మార్గదర్శకాల ప్రకారం ఫార్మాసిటీ అభివృద్ధి, విస్తర ణ, మౌలిక వసతుల కోసం నిధులను మంజూ రు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది. ఫార్మాసిటీలో తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు జాతీయ, అంతర్జాతీయ ఔషధ సంస్థలు అధిక సంఖ్యలో ఆసక్తి చూపుతున్నాయి. ఫార్మాసిటీ అంతా కాలుష్య రహితంగా ఉండేలా ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తుండటంతో ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా తమ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నా యి. ఇప్పటికే ఫార్మాసిటీలో స్థలాల కేటాయింపును కోరుతూ 500 ఫార్మా సంస్థలతోపాటు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేసుకున్నాయి. మొదటి దశలో 400 కంపెనీలకు స్థలాలను కేటాయించనున్నారు. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఎకరం నుంచి అరఎకరం స్థలాన్ని కేటాయిస్తారు.
భూములిచ్చిన రైతులకు ..
ఫార్మాసిటీ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల కు ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎకరానికి 120 గజాల చొ ప్పున ఇంటిస్థలం ఇవ్వనున్నారు. అంతేకాకుం డా భూములిచ్చిన రైతుల కుటుంబాల్లోని యు వతకు ఉచితంగా ఉపాధి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అంతేకాకుండా వీరందరికీ ఫార్మాసిటీలో ఉద్యోగావకాశాలు కూడా లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.