కడ్తాల్, జనవరి 23 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎంపీ రాములు నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న గౌడ, కురుమ, ముదిరాజ్, వడ్డెర కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభు త్వం నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పల్లెలు, తడాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్ పాల్గొన్నారు.
సుభాశ్ చంద్రబోస్ జీవితం ఆదర్శం
యువత నేతాజీ సుభాశ్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ రా ములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వివేకానంద, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చంద్రబోస్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో నేతా జీ చేసిన సేవలు మరవలేనివని, నేతాజీ జీవిత చరిత్రను నేటి తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉన్నదన్నారు. ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేసి, యువతను సైన్యంలోకి చేర్చుకొని ఆంగ్లేయులపై పోరాడిన గొప్ప వీరుడు నేతాజీ అని కొనియడారు.