ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పనితీరు ఆదర్శనీయం
రూ.95 కోట్ల నిధులు మంజూరుతో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
షాద్నగర్, జనవరి 22 : దశాబ్దాల కల నెరవేరిన వేళ, షాద్నగర్ ప్రాంత వాసుల సమస్యకు చరమగీతం పాడుతున్న వేల.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సమయాన షాద్నగర్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. సంవత్సరాల తరబడి అన్ని వర్గాల ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కృషి ఫలితంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి ఆర్వోబీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర, రైల్వే శాఖల నిధుల నుంచి రూ. 95 కోట్ల్లు మంజూరు కావడంతో శనివారం చటాన్పల్లి రైల్వే గేట్ వద్ద సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ల చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని ఆనందం వ్యక్తంం చేశారు. ఎందరో పాలకులు వచ్చినా వంతెన నిర్మాణాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని, కనీస నిధులను రాబటడ్డంపై కూడ శ్రద్ధ చూపలేదన్నారు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని, అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, పట్టణ కౌన్సిలర్లు, గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
కేశంపేట, జనవరి 22 : కేశంపేట మండలంలోని పలు రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించినందుకు శనివారం అల్వాలలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మంగళగూడెం నుంచి లింగంధన వరకు రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు కావడంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని, ఎమ్మెల్యే కృషి వల్లనే నిధులు మంజూరయ్యాయని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తిరుమలరెడ్డి శ్రీనివాస్, కృష్ణయ్య, మల్లేశ్యాదవ్, ఎం.కృష్ణ, టి.మల్లేశ్, శ్రీను, తావుర్యా, రమేశ్, మంగళి రాజు, మహేశ్, బీరయ్య, అలూరి రమేశ్ పాల్గొన్నారు.