ఎస్పీ రంజన్ రతన్కుమార్
గద్వాల అర్బన్, జూలై 21 : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య నివారణకు నూతనంగా ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎస్పీ రంజన్త్రన్కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసే ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ ప్రదేశాన్ని బుధవా రం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 7 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా ప్రస్తుతం 4 సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకుకు ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సహాయ పడుతుందన్నారు. వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ యాదగిరి, సాయుధ రిజర్వ్ డీఎస్పీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్సైలు విక్రం, విజయ్ భాస్కర్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
జిల్లా కేంద్రంలోని ధరూర్మెట్ వద్ద ఉన్న ఈద్గా వద్ద పోలీస్ భద్రతను ఎస్పీ రంజన్ రతన్కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఆయన వెంట డీఎస్పీ యాదగిరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యనాయక్, సీఐ జక్కుల హన్మంత్, ఎస్సైలు హరిప్రసాద్రెడ్డి, రమాదేవి, రజిత తదితరులు ఉన్నారు.