రాజాపేట, నవంబర్ 20 : సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని హర్షిస్తూ శనివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : సీఎం కేసీఆర్ ధర్నాతోనే కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటపాపిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొల్లూరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కోటగిరి పాండరి, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు అయిలి కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం/ మోటకొండూరు : టీఆర్ఎస్ బొమ్మలరామారం మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్గౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మేడబోయిన గణేశ్, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, గుర్రాల లక్ష్మారెడ్డి, బెజ్జెంకి పాపిరెడ్డి, కుక్కదువ్వు ఉపేందర్, నోముల రాంరెడ్డి, కుమార్, రాజు, శాంతాచారి, పాండు పాల్గొన్నారు. మోటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భూమండ్ల సుధీర్, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బొబ్బలి యాదిరెడ్డి, పార్టీ బీసీ సెల్ మండలాధ్యక్షుడు గౌరయ్య, పాల సంఘం చైర్మన్ కొల్లూరి మల్లేశ్మిత్ర, నాయకులు పాల్గొన్నారు.