ఆమనగల్లు, జనవరి 19 : టీఆర్ఎస్ పాలనలో తండాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మాడ్గుల మండలంలోని జయరాం, ఫకీరాతండాల్లో ఎన్ఆర్జీఎస్, సీడీఎఫ్ నిధులు రూ.18 లక్షలు, నల్లవారిపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో తండాల్లో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉండేదని గుర్తు చేశారు. 500 జనాభా ఉన్న తండాలు, గూడాలను పంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం నిధులను కేటాయించినట్లు గుర్తు చేశారు. మాడ్గుల మండలంలో ప్రాధాన్యత క్రమంలో అన్ని గ్రామాలు, తండాల పంచాయతీల నుంచి బీటీ రోడ్ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నల్లవారిపల్లి-మాడ్గుల రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పై పసలేని ఆరోపణలు చేసినా ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తారన్నారు. అనంతరం జయరాంతండాలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వివిధ పార్టీల యువకులను, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ పద్మారెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్నాయక్, సర్పంచ్లు రూపాదేవ్లాల్నాయక్, పద్మ, యాదగిరిరెడ్డి, జంగయ్యగౌడ్, ఎంపీటీసీ వెంకటయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ రవితేజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వరుణ్, మాజీ ఎంపీపీ జైపాల్నాయక్, ఏఎంసీ డైరెక్టర్ సుభాశ్ ఉన్నారు
క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి
కడ్తాల్ : మండలంలోని రావిచేడ్ గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఎంపీటీసీ బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో యువకులు ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ కోఆర్టినేటర్ బాలకృష్ణ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రమేశ్యాదవ్, నాయకులు శ్రీశైలంయాదవ్, శశికాంత్, పవన్, శివ, శ్రీకాంత్, నర్సింహ, లవకృష్ణ, మహేశ్, శ్రీశైలం, మల్లేశ్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.