ఒకరినొకరు సహకరించుకుని ముందుకు నడవాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరులో ఘనంగా దసరా వేడుకలు
ఆకట్టుకున్న రావణవధ
తొర్రూరు, అక్టోబర్16 : చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ఇందుకు సంకేతం దసరావేడుకలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని అమ్మాపురం రహదారిలోని శక్తి స్థల్లో డాక్టర్ పొనుగంటి సోమేశ్వర్రావు నేతృత్వంలో దసరా ఉత్సవ్ కల్చరల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో, యతిరాజారావు పార్కులో వోట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణవధ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే పండుగలు ఓ ప్రత్యేకతకు చిహ్నాలని, మంచి నడవడికతో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు సహకరించుకోవాలని ఆయన కోరారు. తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, యతిరాజారావు పార్కుకు అవసరమైన నిధులు సమకూర్చుతామన్నారు. పార్కు అభివృద్ధి చెందడంలో స్వర్గీయులు నట్వర్ పాత్ర ఎంతో ఉందని గుర్తు చేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ముందుగా వోట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎర్రబెల్లి హజరై మాట్లాడుతున్న సందర్భంలో వర్షం కురవడంతో రావణవధ ప్రతిమను కాల్చారు. అకాల వర్షంతో శక్తిస్థల్లో డాక్టర్ సోమేశ్వర్రావు రావణ ప్రతిమను అనుకున్న సమయంకు ముందుగా కాల్చారు. మంత్రి దయాకర్రావు జోరు వర్షంలోనే వేదిక వద్దకు వచ్చి నిర్వాహకులతో కలిసి వెళ్లారు. యతిరాజరావు పార్కులో నిర్వహించిన కార్యక్రమాన్ని నిర్వాహకులు రామిని శ్రీనివాస్, అనుమాండ్ల దేవేందర్రెడ్డి, మాడ్గుల రోహిత్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, ఎంపీపీ చిన్న అంజయ్య, మున్సిపల్ కమిషనర్ బాబు, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
చెడుపై మంచి విజయం : రెడ్యానాయక్
మరిపెడ : చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ఇందుకు నిదర్శనమే దసరా వేడుకలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రావణవధ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావుతో కలిసి రెడ్యానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణవధ కార్య క్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ దసరా వేడుకలను అందరూ ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరిలో దుర్గుణాలు పోయి సద్గుణాలు రావాలని దుర్గమాతను వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, మున్సిపల్ చైర్మన్ గుగులోత్ సింధూరకుమారి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న, గుగులోత్ రాంబాబు, తేజావత్ రవీంద్రనాయక్, ఉప్పల నాగేశ్వరరావు, రావుల సుమంత్రెడ్డి, శ్రీరామల రాములు పాల్గొన్నారు.
ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి : కలెక్టర్
మహబుబాబాద్ : ప్రజలు ఆయుదారోగ్యాలతో వర్థిల్లాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. విజయ దశమి సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని కోరారు. ప్రజలందరికి ఆయా రంగాల్లో విజయం చేకూరాలని కోరారు.
విజయదశమి విజయం చేకూరాలి : ఎస్పీ
విజయ దశమి అన్ని వర్గాల ప్రజలకు విజయం చేకుర్చాలని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆకాక్షించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయుద , వాహన పూజ నిర్వహించారు. అనంతరం దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ దశమి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. పోలీసులు సైతం శాం తిభద్రతల పరిరక్షణలో మరింతగా కృషి చేయాలన్నారు.అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, అప్పుడే మరింత గుర్తిం పు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఎస్పీ సైదయ్య, ఏఆర్డీఎస్పీ జనార్ధన్, ఎస్బీ సీఐ సురేందర్, ఆర్ఎస్ఐలు సైద య్య, పూర్ణచందర్, లాల్బాబు, సీఐ వెంకటరత్నం, రవికుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.