ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా, డిసెంబర్ 13 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో విడుత రైతుబంధు పథకానికి రూ.7500 కోట్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు. నియోజకవర్గ రైతుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. సాగుకు 24 గంటల విద్యుత్, రైతుబంధు కింద ఎకరాకు రూ. 5 వేల పెట్టుబడి సాయం, రైతుబీమా అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని రైతులకు రైతుబంధు కింద కారుకు రూ.126 కోట్లు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. వానకాలం ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నదన్నారు. దాంతో పాటు యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
ఓర్వలేకే తప్పుడు ప్రచారం
బీజేపీకి చెందిన చింతపండు నవీన్ ప్రజల్లో అయోమయం సృష్టించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అతడి మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. నవీన్కు ప్రజలు బుద్ధిచెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు వెంపటి శంకరయ్య, మల్గిరెడ్డి లింగారెడ్డి, కామర్ల జానయ్య, వర్రా వెంకట్రెడ్డి, రావుల లింగయ్య, దోరేపల్లి వెంకటేశ్వర్లు, తిరుమలగిరి (సాగర్) మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ
నిడమనూరు, త్రిపురారం మండలాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2.5 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందించారు. 12వ వార్డులో పాస్టర్ దుబ్బ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో పేదలకు అందించిన దుస్తులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దోరేపల్లి వెంకటేశ్వర్లు, సురభి రాంబాబు, రావిళ్ల చెన్నయ్య, జానకీరాములు, నాయ కులు పాల్గొన్నారు.