తాండూరు, సెప్టెంబర్ 13: తాండూరు పట్టణంలో ఉన్న నీటి పారు దల శాఖ ఆధ్వర్యంలోని అతిథి గృహ భవనం ఇరవై సంవత్సరాలుగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 1910 నైజాం నవాబుల కాలం లో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేళ్ల్ల క్రితం నీటి పారుదల శాఖ అధికారులు రూ. నాలుగు కోట్ల అంచ నాతో అతిథి గృహం భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ నిధుల మంజూరుకు అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో అతిథిగృహం నిర్మాణ పనులు మోక్షానికి నోచుకోలేదు. అప్పటి ఎమ్మెల్యే మహేందర్రెడ్డి, హోంశాఖ మంత్రి సబితారెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నీటి పారుదల శాఖకు బదులుగా ఆర్ఆండ్బీ శాఖ ఆధ్వర్యంలో అతిథి గృహం భవన నిర్మాణానికి తీర్మానించింది. రూ.60 లక్షలతో భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ నిధులు రెండు సూట్లతో నిర్మించే అతిథిగృహం భవన నిర్మాణానికి సరిపోవని ఆర్ఆండ్బీ అధికారులు తేల్చి చెప్పడంతో మూడంతస్తులతో ఆరు సూట్లతో నిర్మా ణానికి నీటి పారుదల శాఖ అధికారులు రూ.4 కోట్ల నిధుల మం జూరుకు ప్రతిపాదించగా ఆర్ఆండ్బీ అధికారులు మాత్రం కనీసం రూ.2 కోట్ల నిధులైనా అవసరమని తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడేండ్ల క్రితం ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మంత్రి హరీశ్రావుతో మాట్లాడి అతిథిగృ హం నిర్మాణంకు రూ.2.54 కోట్లను విడుదల చేయించారు. నాలుగు సూట్లతో అతిథిగృహం నిర్మా ణానికి నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ అతిథి గృహం పనులు ప్రారంభించి సగం పనులు పూర్తి చేశారు. కాంట్రాక్టర్ అనారోగ్యంతో మృతి చెండంతో మూడేండ్లుగా అతిథిగృహం పనులు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. సగం పూర్త యిన అతిథి గృహం నిర్మాణం పనులు పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో అతిథిగృహం ప్రారం భానికి నోచు కోవడం లేదు. స్థానిక నేతలు, అధికారులు స్పందించి అర్ధాంతరంగా నిలిచిన పనుల ప్రారంభానికి చొరవ చూపితే భవన నిర్మాణం పూర్తియ్యే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.