జడ్చర్ల, జడ్చర్లటౌన్, నవంబర్12: దమ్ముంటే తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేస్తామని కేంద్రంతో చెప్పించి లెటర్ ఇప్పించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాష్ట్ర బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ ధ్వంధవైఖరికి నిరసనగా తాసిల్దార్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ రంగం వేగవంతంగా అభివృద్ధ్ది దిశలో పయనిస్తున్నదని, పథకాలతో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నారని చెప్పారు. దేశంలో మొట్టమొదటగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వడ్లు కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. అన్నివిధాలా రైతులకు భరోసాగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే రైతులందరూ వెళ్తున్నారన్న భయంతోనే బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవపట్టించే పనిలో ఉన్నారన్నారు. రైతులను నాశనం చేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఓ వైపు వడ్లు కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం రైతులకు నష్టం కలిగించేందుకు వరిపంట వేయాలని చెబుతున్నారన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నీతిన్ గడ్కారి స్వయంగా వడ్లు పండించొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రకటన చేస్తున్నారన్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కేవలం ఓట్లు, అధికారం, స్వార్థ రాజకీయాల కోసమే ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ధ్వంధవైఖరిని అలంబిస్తున్న బీజేపీ నాయకుల మాటలు, డ్రామాలను నమ్మి నష్టపోవద్దని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కోరారు. తెలంగాణ రైతులపై చిత్తశుద్ధి ఉంటే వడ్లు కొంటామని కేంద్ర ప్రభుత్వంతో లెటర్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కోనాల్సిందే..
హన్వాడ, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వడ్లు కోనాల్సిందేనని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోడీకి గుణపాఠం తప్పదు
కోయిలకొండ నవంబర్ 12: రైతుల వ్యతిరేకి ప్రధాని మోడీకి తగిన గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో శుక్రవారం నిరసన తెలపి నారాయణపేట నిరసన కార్యక్రమానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్, రైతుబంధు కన్వీనర్ మల్లయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, నాయకులు రాజేంద్రప్రసాద్గౌడ్, గిరిధారి నాగన్న, శ్రీనివాస్రెడ్డి, భీంరెడ్డి, రాజవర్ధన్రెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్నాకు తరలిన నాయకులు
గండీడ్/మహ్మదాబాద్, నవంబరు 12: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగిలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఉమ్మడి గండీడ్ మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులతోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు వివిధ వాహనాల్లో నియోజకవర్గం కేంద్రానికి చేరుకుని ఎమ్మెల్యే మహేశ్రెడ్డికి మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు పెంట్యానాయక్, బిక్షపతి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు ధర్నాకు తరలిన నాయకులు
భూత్పూర్, నవంబర్12: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు ధర్నాకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నియోజకవర్గ కేంద్రానికి తరలివెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, నాయకులు మురళీధర్గౌడ్, గడ్డంరాములు, రాంరెడ్డి, మాధవరెడ్డి, నర్సింహారెడ్డి, వెంకటయ్య, అసద్ వెళ్లారు.
తరలిన రాజాపూర్ నాయకులు
రాజాపూర్, నవంబర్ 12: జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి టీఆర్ఎస్ మండల నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీతోపాటు ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు, రైతుబంధు అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తరలివెల్లారు.
మిడ్జిల్ మండల నాయకులు
మిడ్జిల్, నవంబర్12: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో జడ్చర్లలో నిర్వహించిన ధర్నాకు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరిలివెళ్లారు. పార్టీ మండలాధ్యక్షుడు పాండు, ప్రజాప్రతినిధులు, నాయకులు సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, బాలు, ఎల్లయ్యయాదవ్, సుదర్శన్, బాలయ్య, దానియేలు, శివ, బాబా, వెంకట్, వెంకట్రెడ్డి, నారాయణరెడ్డి, భాస్కరాచారి, శేఖర్, శ్రీనివాసులు, రామకృష్ణ, నవీనాచారి, బంగారు, భీంరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
బాలానగర్ మండల నాయకులు
బాలానగర్, నవంబర్ 12: జడ్చర్లలో తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన రైతు ధర్నాకు మండల నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, లక్ష్మన్నాయక్, మండలాధ్యక్షుడు శ్రీనివాసారావు, మండల ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, రైతు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటాచారి, గ్రామ అధ్యక్షుడు రవికుమార్, సర్పంచ్ శంకర్, మనోహరాచారి, చక్రం చారి, నితీష్, రైతులు, తరలివెళ్లారు.
నవాబ్పేట మండల నాయకులు
నవాబ్పేట, నవంబర్12: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతుధర్నాకు టీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. పెద్ద ఎత్తున తరలివెళ్లి ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. తరలివెళ్లిన వారిలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, శీనయ్య, లక్ష్మయ్య, అబ్దుల్లా, యాదయ్య తదితరులు ఉన్నారు.