దేవరకద్ర రూరల్, నవంబర్ 5 : వానకాలం సీజన్లో సాగైన ధాన్యం కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొంటుందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులను ఆర్థికంగా అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ వానకాలంలో వచ్చిన పంటలకు నష్టం రాకుం డా మొదటి రకం క్వింటాకు రూ.1960, రెండో రకం రూ. 1940 ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పంటలను ఏ రకంగా విక్రయించాలో అన్న భ యం అవసరం లేదని, ఇబ్బందుల్లేకుండా సర్కారు అన్ని చర్య లు చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో వరి సాగైనట్లు తెలిపారు. ప్రతి గ్రా మంలో ఎంత మేర సాగైందో అధికారులు వివరాలు తెలుసుకొని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చె ప్పారు. కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ సుగుణమ్మ, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఖదీర్పాషా, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, నాయకులు కొండ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.