రంగారెడ్డి జిల్లాలో 31,61,222 మంది ఓటర్లు
పురుషులు-1645635, మహిళలు-1514536, ఇతరులు-1151
వికారాబాద్ జిల్లాలో 8,96,892 మంది ఓటర్లు
పురుషులు-449029, మహిళలు-447839, ఇతరులు-544
తుది జాబితాను విడుదల చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 5 : ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన అనంతరం ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. అయితే జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లకు అవకాశమివ్వడంతోపాటు గతేడాది జనవరి 5 నుంచి ఈ ఏడాది జనవరి 5 వరకు జిల్లావ్యాప్తంగా 63,578 మంది ఓటర్లు పెరిగారు. ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న ఓటరు ముసాయిదాను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులో సవరణలతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశమిచ్చింది. జిల్లాలో పెరిగిన ఓటర్లలో అత్యధికంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 29,838 మంది, అత్యల్పంగా చేవెళ్ల నియోజకవర్గంలో 454 మంది ఉన్నారు.
పెరిగిన ఓటర్లు నియోజకవర్గాలవారీగా..
నియోజకవర్గం ఓటర్లు
రాజేంద్రనగర్ 11,874
మహేశ్వరం 9282
శేరిలింగంపల్లి 8827
ఇబ్రహీంపట్నం 6387
షాద్నగర్ 1937
కల్వకుర్తి 1147
జనవరి 5, 2021న జిల్లాలో మొత్తం ఓటర్లు-30,97,644 మంది ఉండగా, జనవరి 5, 2002న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 31,61,222 మంది ఓటర్లకు పెరిగారు. జిల్లాలో 3307 పోలింగ్ కేంద్రాలున్నాయి.
జిల్లాలో 31,61,222 మంది ఓటర్లు
జిల్లాలో గతేడాదితో పోలిస్తే కొత్త ఓటర్లు భారీగా పెరిగారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 63వేల మందికిపైగా గత ఏడాది కాలంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అత్యధికంగా అర్బన్ ప్రాంతాల్లోనే కొత్త ఓటర్లు పెరుగడం గమనార్హం.
ఓటర్ల తుది జాబితా విడుదల
పరిగి, జనవరి 5 : ఓటర్ల తుది జాబితాను బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విడుదల చేశారు. జిల్లాలో ఓటర్లు 8,96,892 కాగా.. వారిలో పురుషులు 4,49,029, మహిళలు 4,47,839, థర్డ్ జెండర్ 24 మంది ఉన్నారు. 2021 నవంబర్ 1న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు 9,01,126 ఉండగా.. మార్పు చేర్పుల అనంతరం తుది జాబితాలో 4234 ఓటర్లు తగ్గారు. జిల్లా పరిధిలో 2022 జనవరి 1 నాటికి కొత్త ఓటర్లు 5714 కాగా.. వారిలో పురుషులు 2927, మహిళలు 2787 ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో 1644, వికారాబాద్లో 919, తాండూరులో 1579, కొడంగల్లో 1572 మంది ఉన్నారు. మృతిచెందినవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, రెండు చోట్ల పేర్లుంటే ఒక చోట మాత్రమే చేయగా.. 9946 మందిని తొలగించాల్సి వచ్చింది. వీరిలో పురుషులు 5056, మహిళలు 4890 మంది ఉన్నారు. పరిగి నియోజకవర్గంలలో 3589, వికారాబాద్లో 4033, తాండూరులో 492, కొడంగల్ నియోజకవర్గంలో 1832 మందిని తొలగించారు.