షాద్నగర్, జనవరి 5 : రైతు సుభిక్షమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల పాలిట దేవుడయ్యారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ గ్రామం లో నిర్వహించిన రైతు బంధు సంబురాల్లో పాల్గొని మాట్లాడారు. సీఎం తన అద్భుతమైన ఆలోచనతో రైతు బంధు, రైతు భీమా పథకాలను అమలుచేసి ప్రతి రైతు కుటుంబానికి భరోసా ఇచ్చారన్నారు. మహిళలు రైతు బంధు పేరుతో ముగ్గులు వేసి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకట్రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ గీతారెడ్డి పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యం
నందిగామ : మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాల నిర్వహించారు. జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణలో రైతు మెచ్చిన పాలన
కొత్తూరు : తెలంగాణలో రైతులు మెచ్చిన పాలన నడుస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. తిమ్మాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్యర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ ఈ నెల 10 వరకు రైతుబంధు సంబురాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో మెండె కృష్ణయ్యయాదవ్, దేవేందర్యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, గూడూరు సర్పంచ్ సత్తయ్య, అధికారులు సన, దీపిక, నాయకులు రాజు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధే లక్ష్యం
మొయినాబాద్ : రైతులను సంక్షేమంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని రైతు వేదికలో రైతు బంధు సంబురాలు మండల వ్యవసాయ అధికారి ఎన్ రాగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవోలు కుమార్, సునీల్, వైస్ ఎంపీపీ మమత, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు మల్లేష్, రవీందర్,అర్జున్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, నాయకులు జయవంత్, నాగరాజు, కృష్ణ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని రామన్నగూడ, న్యాలట గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, రామన్నగూడ సర్పంచ్ లావణ్యశంకర్, న్యాటల సర్పంచ్ చాకలి లక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బర్కల రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు మాణిక్యరెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.
కొందుర్గులో రైతుబంధు సంబురాలు
కొందుర్గు : మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతుబంధు సంబురాలు జరుపుకున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు డబ్బులతో రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనులకు ఖర్చు చేసుకుని అధిక దిగుబడులు తీయాలన్నారు. కార్యక్రమంలో ఏవో మధుసూదన్, ఏఈవో శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.