టీఆర్ఎస్ పాలనలో రైతు రాజ్యం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
వివిధ చోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించ తలపెట్టిన రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని ఉప్పరిగూడ రైతువేదికలో అలంకరణ కార్యక్రమం, రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతాంగమంతా సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ నెల 10 వరకు రైతుబంధు సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. చివరిరోజున గ్రామాలు, మండలస్థాయిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా ప్రదర్శనతో బయలుదేరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే భారీ ప్రదర్శన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అనంతరం రైతులతో కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఉప్పరిగూడ రైతు వేదికలో పూలతో జై కేసీఆర్, జై రైతుబంధు పేర్లను అందంగా అలంకరించారు. ముకునూరు రైతువేదికలో ఏఈవో శ్రవణ్ ఆధ్వర్యంలో సంబురాలు అంబరాన్నంటాయి.
ఉప్పరిగూడ గ్రామాభివృద్ధికి కృషి
ఇబ్రహీంపట్నం ఖాల్సా పరిధిలోని సర్వేనంబర్ 1146లోని ఉప్పరిగూడ గ్రామ రైతులకు సంబంధించి 118 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. రైతులందరూ ఒకతాటిపైకి వస్తే ఈ సమస్యను తాను స్వయంగా రెవెన్యూ అధికారులను గ్రామానికి తీసుకువచ్చి దగ్గరుండి పరిష్కరించి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ రాంరెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, సహకార సంఘం చైర్మన్ సుదర్శన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి పాల్గొన్నారు.
ఘనంగా రైతుబంధు వారోత్సవాలు
యాచారం : మండలంలోని చింతపట్ల, నందివనపర్తి గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను బుధవారం వ్యవసాయశాఖ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చింతపట్ల, నందివనపర్తి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తెలంగాణ రైతుబంధు, 50వే ల కోట్లు విడుదల, జై కేసీఆర్ అని వరి ధాన్యంతో రాసి ప్రదర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, నందివనపర్తి సర్పంచ్ ఉదయశ్రీ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, డైరెక్టర్లు శశికళ, స్వరూప, మండల వ్యవసాయ అధికారి సందీప్, విస్తరణ అధికారి గాయత్రి, సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
మంచాల : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకంతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. మండల కేంద్రంలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఏఈవో జ్యోతిశ్రీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, బహదూర్, నాయకులు జంగారెడ్డి, శంకర్, బద్రీనాథ్ ఉన్నారు
పెట్టుబడిసాయం అందించి..
అబ్దుల్లాపూర్మెట్ : సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించి రైతు బాంధవుడిగా నిలిచారని రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ రైతు వేదిక వద్ద మండల కోఆర్డినేటర్ కందాళ బలదేవరెడ్డి ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలకు హాజరయ్యారు. వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతులకు భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్కుమార్గౌడ్, మండల వ్యవసాయ అధికారి శ్రీఉమ, విస్తరణాధికారి లక్ష్మణ్, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, గ్రామ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
తలకొండపల్లి : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల పాఠశాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టులతో రైతులకు మేలు అనే అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, సోషల్మీడియా ఇన్చార్జి శివశంకర్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.