ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన ఐలమ్మకు రూ.60 వేలు, మౌలాలికి రూ.26 వేలు, సదానందంకు రూ.25వేలు, పోల్కంపల్లి గ్రామానికి చెందిన గణేశ్కు రూ.60 వేలు, గున్గల్ గ్రామానికి చెందిన సుదర్శన్కు రూ.34 వేల సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, పోల్కంపల్లి సర్పంచ్ ఆండాళు, ఎంపీటీసీ మంగ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్ష్మీనర్సింహస్వామి సేవలో ..
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 4: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశా రు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని తెలిపారు. స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజ లు సంతోషంగా ఉండాలని అభిలాషించారు. అనంతరం ఆయన ఆలయ పరిసరాలను కలియతిరిగారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు గోపాల్ తదితరులున్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో..
తలకొండపల్లి, డిసెంబర్ 4: బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని బదునాపూర్ గ్రామానికి చెందిన లింగంయాదవ్కు రూ. 28వేలు, మాడ్గుల మండలానికి చెందిన తిరుపతయ్యకు రూ.20వేలు, మల్లయ్యకు రూ. 27వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆమనగల్లు, డిసెంబర్4: ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో ఉన్న పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మం జూరైన చెక్కులను శనివారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. మాడ్గుల మండలంలోని బ్రహ్మణపల్లికి చెందిన తిరుపతయ్యకు రూ.20 వేలు, గీతకు రూ.18 వేలు, గిరికొత్తపల్లికి చెందిన మల్లయ్యకు రూ.27 వేలు, తలకొండపల్లి మండలంలోని లింగంయాదవ్ కు రూ.28వేలు మంజూరయ్యాయి.
తుర్కయాంజాల్లో..
తుర్కయాంజాల్, డిసెంబర్ 4: సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను శనివారం లబ్ధిదారులకు డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అందజేశారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సూర్యకళకు రూ.56వేలు, ఉప్పరిగూడకు చెందిన మల్లారెడ్డికి రూ.34 వేలు, మహేశ్కు రూ.12 వేల చొప్పుల చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొండ్రు శ్రీనివాస్, ఏనుగు అయ్యప్పరెడ్డి, గొరిగె ముత్యాలు, గొరిగె దయాకర్ తదితరులు పాల్గొన్నారు.