కడ్తాల్, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య రాష్ర్టానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మాజీ సీఎం మృ తికి సంతాపంగా శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్య తనదైన ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, సు లోచన, నాగమణి, భారతమ్మ, లోకేశ్నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, మంజుల, ప్రియ, నిర్మల, ఉమావతి, రాములుగౌడ్, ఎంపీడీవో రామకృష్ణ, జహంగీర్బాబా, నాయకులు పాల్గొన్నారు.
రోశయ్యకు నివాళి
ఆమనగల్లు, డిసెంబర్ 4: మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృ తికి సంతాపంగా శనివారం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రామ్మోహన్, చంద్రశేఖర్, పాండురంగయ్య, శ్రీనివాస్,వెంకటయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
మండల సర్వసభ్య సమావేశం వాయిదా
నందిగామ, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతికి సంతాపంగా నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ అధ్యక్షతన శనివా రం జరుగాల్సిన మండల సర్వసభ్య సమావేశం వాయిదాపడింది. ఈ సందర్భంగా మాజీ సీఎం మృతికి సంతాపం తెలుపుతూ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశం తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు.
తొర్రూర్ గ్రామంలో..
తుర్కయాంజాల్, డిసెంబర్ 4: మాజీ సీఎం రోశ య్య మృతికి సంతాపంగా తుర్కయాంజాల్ ము న్సిపాలిటీ తొర్రూర్ గ్రామంలో శనివారం రోశయ్య చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్స్ ఫోరం అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మశివకుమార్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఐలయ్య, కౌన్సిలర్లు అనూరాధాదర్శన్, రవీందర్రెడ్డి, సునీల్, మాజీ సర్పంచ్ అంజయ్య, జైపాల్ రెడ్డి, గోపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, యాదగిరి, గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.