బాలయ్య రూపొందించిన చీర పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భూదాన్పోచంపల్లి, నవంబర్ 30 : చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని, వారికి తాను కూడా అండగా ఉంటానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పోచంపల్లి పట్టణానికి చెందిన బోగ బాలయ్య నేసిన 111 రకాల డిజైన్ల చీరను మంగళవారం ఆయన ఇంటికి వెళ్ల్లి తిలకించారు. బాలయ్య కళా ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచంపల్లికి ప్రపంచ పర్యాటక రంగంలో గుర్తింపు రావడానికి చేనేత కార్మికుల కృషి, ప్రతిభ ఎంతగానో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భూదాన్పోచంపల్లి పట్టణంలోని చేనేత సహకార సంఘం డై హౌజ్లో పోచంపల్లి పురపాలక సంఘం, ఆర్వీఎం చారిటబుల్ దవాఖాన ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అర్హులందరికీ సీఎం సహాయ నిధి అందజేస్తున్నదన్నారు. త్వరలో హెల్త్ ప్రొఫైల్ చెకప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్వీఎం చారిటబుల్ హాస్పిటల్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. వైద్య శిబిరంలో 300 మందికి వివిధ పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి, వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.