ఎమ్మెల్యే నోముల భగత్
తిరుమలగిరి (సాగర్) : ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని జాల్తండా, నెల్లికల్, చిల్కాపురం, నాయకునితండా, తూటిపేటతండా గ్రామాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే హాలియాలోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాధం సంపత్కుమార్, కట్టెబోయిన అనిల్కుమార్యాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, యువజన అధ్యక్షుడు జటావత్ రమేశ్, సర్పంచ్ మెగావత్ రాంసింగ్, జటావత్ స్వామి పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ : మండలంలోని ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీలను మంగళవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అందించారు. మిర్యాలగూడ మండలం భాగ్యగోపసముద్రం తండాకు చెందిన ప్రవళ్లిక అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెకు మెరుగైన చికిత్స కోసం రూ. 5 లక్షలు, పట్టణానికి చెందిన జస్రాధ్సింగ్కు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుర్ర విష్ణు, జావిద్, ఫహీమొద్దీన్, షోయబ్, అమృతం దుర్గాసత్యం, శంకర్నాయక్, విజయ, రాంసింగ్ పాల్గొన్నారు.