నల్లగొండ ప్రతినిధి, మార్చి 18(నమస్తే తెలంగాణ): సుదీర్ఘంగా కొనసాగుతున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ తన ఆధిక్యతను కొనసాగిస్తున్నది. ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి తన ఆధిక్యతను కనపరిచారు. గురువారం రాత్రి పది గంటల వరకు ఐదు రౌండ్ల తొలి ప్రాధాన్యత ఓట్ల లె క్కింపు ముగిసే సరికి 18,549 ఓట్ల మెజార్టీని సాధించారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి మొత్తం 79,113 ఓట్లు రాగా తర్వాత స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 60,564ఓట్లతో రెండో స్థానంలో, 49, 200ఓట్లతో కోదండరామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. వీరి తర్వాత స్థానాల్లో 28,991 ఓట్లతో బీజేపీ, 20,274 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్దులు ఉన్నారు. అయితే ఇప్పటివరకు చెల్లిన ఓట్లను, ఆయా అభ్యర్థ్ధుల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తే తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ గెలుపు కోటా వచ్చే అవకాశాలు లే వు. దీంతో అనివార్యంగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కించాల్సిందే. నేటి ఉదయం నుంచి లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులోనూ తేలకపోతే తృతీయ, ఆ తర్వాత ప్రాధాన్యత ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోక తప్పదని తెలుస్తుంది. ఇదేజరిగితే శుక్రవారం కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
2007లో శాసనమండలి పునరుద్ధరణ నాటి నుంచి కంచుకోటగా ఉన్న పట్టభద్రుల నియోజకవర్గంలో మరోసారి విజయం దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఏడు రౌండ్లలో జరుగనుండగా రాత్రి పది గంటల వర కు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఆరో రౌండ్ను కొనసాగిస్తున్నా రు. మరో రౌండ్ మిగిలి ఉండడంతో అది కూడా ఈ ఉదయానికి పూర్తి కానుంది. గురువారం అర్థ్ధరాత్రి వరకు దాదాపు 30 గంటల పాటు నిరాటంకంగా లెక్కింపు కొనసాగగా ఆరు రౌండ్ల పూర్తి చేయగలిగారు. అభ్యర్థ్ధుల సంఖ్య భారీగా ఉండడంతో ఒ క్కో రౌండ్లో 56వేల ఓట్ల లెక్కింపుతో సుదీర్ఘంగా కౌంటింగ్ కొ నసాగుతున్నది. అయితే అధికారికంగా ఐదు రౌండ్ల ఫలితాలు వె ల్లడికాగా ఇందులో ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. తొలి రౌండ్లో 4,084, రెండో రౌండ్లో 3,787, మూడో రౌండ్లో 3,816, నాలుగో రౌండ్లో 3,751, ఐదో రౌండ్లో 3,111ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇంకా రౌండ్లలోనే సగటు ఇదే ఆధిక్యత రావచ్చన్న అంచనాతో ఉన్నారు. అయితే ప్రతీ రౌండ్లోనూ చెల్లి న ఓట్లలో సగటున 30 శాతం ఓట్లతో పల్లా రాజేశ్వర్రెడ్డి ముం దంజలో ఉన్నారు. ఐదు రౌండ్లలో కలిపి మొత్తం 79113 (29. 91శాతం)ఓట్లను సాధించి 18,549ఓట్ల ఆధిక్యతతో పల్లా ముం దంజలో ఉన్నారు. తర్వాత స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొత్తం 60,564(22.90శాతం) ఓట్లను, కోదండరామ్ మొత్తం 49200(18.60శాతం)ఓట్లను సాధించారు. అయితే అన్ని రౌండ్లలోనూ తొలి స్థానంలో పల్లా, రెండోస్థానంలో మల్ల న్న,కోదండరామ్ మూడో స్థానంలో కొనసాగుతూ వస్తున్నారు.
తప్పని ద్వితీయ ఓట్ల లెక్కింపు..
మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటాతో విజేత తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఏడు రౌండ్ల ఓట్ల పూర్తయ్యాక చెల్లిన ఓట్లలోంచి 50శాతం+1 గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఐదు రౌం డ్ల వరకు ఉన్న చెల్లిన ఓట్లను ఉజ్జాయింపుగా తీసుకుని లెక్కెస్తే గెలుపు కోటాకు కనీసం 1.80లక్షల ఓట్లు అవసరం పడనున్నా యి. ఐదు రౌండ్లలో ఉన్న ట్రెండ్ను బట్టి పరిశీలిస్తే ఏడు రౌండ్ల ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థ్ధి పల్లాకు 1.10లక్షల వరకు రావచ్చని అంచనా. కానీ ప్రస్తుతం పల్లా 30శాతం తొలి ప్రాధాన్యత ఓట్లనే సాధించారు. అంటే మరో 70వేల ఓట్లు పల్లా విజయం సాధించాలంటే అవసరం పడుతున్నాయి. ఇదే లెక్కన పరిశీలిస్తే రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు 85వేల ఓట్లు రావచ్చు. కానీ ఆయన విజయానికి మరో 28 శాతంతో సమారు 95వేల ఓట్లు అవసరం కానున్నాయి. ఇక మూడో స్థానంలో ఉన్న కోదండరామ్ లెక్కలను సుమారుగా లెక్కిస్తే 68వేల ఓట్ల మార్క్ను దా టవచ్చు. కానీ ఆయన గెలుపునకు మరో 1.12లక్షల ఓట్లు అవసరం పడనున్నాయి. ఈ ప్రకారంగా చూస్తే ఎవ్వరికీ కూడా తొలి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఆసాధ్యమనేది స్పష్టం. అందు కే ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానుంది. ఇక్క డ తొలి ప్రాధాన్యత ఓట్లతో అతి తక్కువ సాధించిన అభ్యర్థ్ధికి వ చ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను బ్యాలెట్లో సూచించిన అభ్యర్థ్ధులకు పంచుతూ చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ఇలా మొ త్తం 71మంది అభ్యర్థులు ఉండగా ఒక్కొక్కరిని తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ వస్తారు. ఇలా చివరి ఇద్దరూ అభ్యర్థ్ధులు మిగిలే వరకు ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా గెలుపు కోటా రాకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్ల ను కూడా లెక్కిస్తారని తెలుస్తుంది. అధికారులు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నేడు కూడా రోజంతా కౌంటింగ్?
తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలే అవకాశం లేకపోవడం తో తర్వాత ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందులో నూ ఏ ఒక్క అభ్యర్థికి గెలుపు కోటా రాకపోతే తృతీయ ఆ తర్వా త ప్రాధాన్యత ఓట్లను లెక్కించక తప్పదని తెలుస్తుంది. ఇదే జరిగితే శుక్రవారం అంతా కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే 40గంటలకు పైగా సుధీర్ఘంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. షిప్టుల వారీగా సిబ్బంది, అధికారులు, కౌంటింగ్ ఏజెంట్లు విధుల్లో పాల్గొంటున్నారు. 2007లో శాసనమండలి పునరుద్ధ్దరణ నాటి నుంచి జరిగిన అన్ని కౌంటింగ్లలోనూ ఇదే సుదీర్ఘమైన లెక్కింపు కానుంది.
తగ్గిన చెల్లని ఓట్లు
పట్టభద్రుల ఎన్నికల్లోనూ చెల్లని ఓట్లు భారీగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారుతుంది. అభ్యర్థ్ధుల ప్రచారంలో సోషల్ మీడియా, అధికారికంగానూ అవగాహన కల్పిస్తున్నా పట్టభద్రు లు ఓటు వేయడంలో తడబాటుకు గురవుతూనే ఉన్నారు. ఈ సారి కూడా చెల్లని ఓట్లు భారీగానే ఉంటున్నాయి. గురువారం రాత్రికి ఐదు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి మొత్తం 279970 ఓట్లను లెక్కించగా అందులో 15533 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్థ్ధారించారు. ఇవి మొత్తం ఓట్లలో 5.54శాతంగా ఉన్నా యి. అయితే 2015 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలతో పోలిస్తే ఈసారి చెల్లని ఓట్ల శాతం సగానికి తగ్గిపోయినట్లే. కిందటి సారి 9.14శాతంతో 14వేల పైచిలుకు ఓట్లు చెల్లకుండా పోయా యి. మొత్తం ఏడు రౌండ్ల కౌంట్ ముగిస్తే మనకు మరింత స్పష్టత రానుంది. ఇక పోస్టల్ బ్యాలెట్లలోనూ 1917ఓట్లకు గానూ 79 ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం.