గండీడ్, జనవరి 2 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే ప్రతి పల్లెకూ బీటీరోడ్డు నిర్మిస్తున్నట్లు జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సూచనమేరకు ఆదివారం మండలంలోని జిన్నారంతండా బీటీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మారుమూల పల్లెలు, తండాలకు బీటీరోడ్లు నిర్మించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కృషితో గ్రామాలు సుందరంగా మారుతున్నాయని తెలిపారు. అలాగే ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, వైస్ఎంపీ పీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, మాజీ సర్పంచ్ ఉప్పరి గోపాల్, రాజ్కుమార్రెడ్డి, రాం చంద్రారెడ్డి, వెం కట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.