సూర్యాపేట, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివని, ఆయన కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు అన్నారు. జయశంకర్ సార్ జయంతిని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ దీపిక, వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం నివాళులర్పించారు. కలెక్టరేట్, క్యాంపు కార్యాలయాల్లో జరిగిన జయశంకర్ జయంతిలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు, నాయకులు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, కార్యాలయంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షం, ఎంపీడీఓ శ్రీనివాస్రావు సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి నిర్వహించారు. చివ్వెంల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధరావత్ కుమారి, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ గోపి పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎస్)లో ఎంపీపీ స్వర్ణలత, ఎంపీడీఓ మల్సూర్నాయక్, ఎంపీఓ సంజీవయ్య పొఫెసర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ప్రొఫెసర్ అశయాలను సాధిస్తాం : ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
కోదాడ : కోదాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన జయశంకర్ ఆశయాలను ప్రభుత్వం సాధిస్తున్నదన్నారు. అనంతరం తెలంగాణ చాణిక్య చంద్రగుప్తుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. నడిగూడెంలో ఎంపీపీ జడ్పీటీసీ కవిత, తాసీల్దార్ ఆనంద్బాబు, ఎంపీడీఓ ఇమామ్ పాల్గొన్నారు. మునగాల తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అనంతగిరిలో తాసీల్దార్ వాజిద్ ప్రొఫెసర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. మోతె మండలంలో ఎంపీపీ ముప్పాని ఆశ, ఎంపీడీఓ శంకర్రెడ్డి, ఎంపీఓ హరిసింగ్
తుంగతుర్తి నియోజకవర్గంలో..
తిరుమలగిరి : మండలంలో జయశంకర్ చిత్రపటానికి ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, అధికారులు, నాయకులు నివాళులర్పించారు. అర్వపల్లి తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో జయశంకర్ జయంతి నిర్వహించారు. ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, తాసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీఓ సురేశ్కుమార్, నర్సింహరాజు పాల్గొన్నారు. మద్దిరాల తాసీల్, ఎంపీడీఓ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జయశంకర్ జయంతిని నిర్వహించారు. జడ్పీటీసీ కన్న సురాంబ, తాసీల్దార్ మన్నన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, నాయకులు పాల్గొన్నారు. నాగారం మండలంలో ఎంపీపీ కూరం మణి, తాసీల్దార్ కమలాద్రి, ఎంపీడీఓ శోభారాణి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కిశోర్, జడ్పీ చైర్పర్సన్ దీపిక, ఎంపీపీ గుండగాని కవిత, పీఏసీఎస్ చైర్మన్ సైదులు నివాళులర్పించారు. నూతనకల్లో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ దామోదర్రెడ్డి, ఎంపీడీఓ ఇందిర, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో..
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఇందిరా సెంటర్లో బీసీ సంఘం నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. నేరేడుచర్లలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, తాసీల్దార్ సరిత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇంజమూరి యశోద గరిడేపల్లిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి, మేళ్లచెర్వులో ఎంపీపీ కొట్టె పద్మావతి, మఠంపల్లిలో ఎంపీడీఓ జానకిరాములు, చింతలపాలెంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. పాలకవీడు మండల కేంద్రం,పలు గ్రామాల్లో జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.