మాదాపూర్ : హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు వారికి టీకాలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో పాటు టీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ … రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రజల ఆర్యోగాన్ని దృష్టిలో ఉంచుకొని 15 నుండి 18 ఏండ్ల వయసున్న వారికి వాక్సినేషన్ ఇస్తుందన్నారు. దీనిని ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకొని కరోనాను కట్టడి చేయడంలో బాగస్వామ్యం వహించాలని కోరారు.
ప్రతి ఒకరు దగ్గరలో అందుబాటులో ఉన్నవ్యాక్సిన్ సెంటర్లకు వెళ్ళి టీకాలను తీసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలను వేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా సంజీవరెడ్డి, కృష్ణ ముదిరాజ్, లక్ష్మారెడ్డి, హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్రావు, ఉపాద్యాక్షులు షేక్ జమీర్, సయ్యద్ సాధిక్ హుస్సెన్, శేఖర్ ముదిరాజ్, కనకమామిడి వెంకటేష్ గౌడ్ పద్మరావు, శంకర్, సుదేష్, రఘునాథ్, వెంకట్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.