పల్లె పర్యటనలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సోమవారం భూదాన్పోచంపల్లి మండలంలో తిరిగారు. దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దగ్గరికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. వంకమామిడి గ్రామంలో దివ్యాంగుడు దాసరి సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కూటర్పై ఎక్కి కాసేపు పర్యటించారు.
బీబీనగర్ (భూదాన్పోచంపల్లి), మే 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యటనలో భాగంగా పోచంపల్లి మండలంలోని దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో హెచ్ఎండీఏ నిధులు రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.75లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం దోతిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, ఎంపీడీఓ బాలశంకర్, చౌటుప్పల్ రూరల్ సీఐ వెంకటయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సామ రవీందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, సర్పంచులు దోటి కుమార్, బొడిగె శంకరయ్య, ఎంపీటీసీ రావుల శ్రీదేవీశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పగిళ్ల సుధాకర్రెడ్డి, నాయకులు పగిళ్ల స్వప్నారాంరెడ్డి, నోముల మాధవరెడ్డి, సీత వెంకటేశం పాల్గొన్నారు.