భువనగిరి అర్బన్, మే 2 : గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. మండలంలోని బీఎన్ తిమ్మాపురం, అనాజిపురం, రెడ్డినాయక్తండా, ఏటీబీ తండాలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యాన్ని వెంటనే తూకం వేసి తరలించేలా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్నాయక్, మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, సర్పంచులు పిన్నం లత, ఏదునూరి ప్రేమలత, ఎంపీటీసీలు ఉడుత శారద, గు నుగుంట్ల కల్పన, ఏపీఎం లింగయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, నాయకులు సుజాత, కేశవరెడ్డి, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి అన్నారు. మండలంలోని నేలపట్ల, జైకేసారం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌట వేణుగోపాల్గౌడ్, ఎంపీటీసీ తడక పారిజాత, డైరెక్టర్లు పబ్బతి వెంకటయ్యగౌడ్, దొడ్డి శ్రీశైలం, బుట్టి శ్రీనివాస్, యాదగిరి, గుండు మల్లయ్యగౌడ్, ఆంజనేయులుగౌడ్, బాలరాజు పాల్గొన్నారు.
వలిగొండ : రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని కంచనపల్లి, చైతన్యపురి, టేకులసోమారం, పహిల్వాన్పూర్, మాధవనగర్, దాసిరెడ్డిగూడెం, కేర్చిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచులు తుమ్మల వెంకట్రెడ్డి, మద్దెల మంజుల, కొమిరెల్లి రమ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ స్వామి, డైరెక్టర్లు సంజీవరెడ్డి, వెంకట్రెడ్డి, పాండరి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
బీబీనగర్ (భూదాన్పోచంపల్లి) : పోచంపల్లి మున్సిపాలిటీలోని నారాయణగిరి, సీతావనిగూడెం, ముక్తాపూర్, మండలంలోని గౌస్కొండ, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, వైస్ చైర్మన్ సామ మోహన్రెడ్డి, బాతుక లింగస్వామి, సర్పంచులు ఫక్కీరు లావణ్య, రమావత్ రాములు, దొడ్డి అలివేలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నోముల మాధవరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రావుల శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట, మే 2 : కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరించినా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం అన్నారు. మండలంలోని పల్లివాడ, సూరారం గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కడమంచి సంధ్య, పోలెబోయిన ఆండాలు, ఎంపీటీసీలు గాదె పారిజాత, దోమల సతీశ్, ఉప సర్పంచ్ కల్లూరి నాగేశ్, డైరెక్టర్ కల్లూరి సైదమ్మ, రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భీమలింగం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.