అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు బట్టలతోపాటు ఇఫ్తార్ విందు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్లో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీబూర నర్సయ్యగౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ముస్లింలకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు ఇస్తున్నారని, నేడు అదే పద్ధతిని కొనసాగిస్తున్నారన్నారు. మత రాజకీయాలకు చరమగీతం పాడి, నమ్మిన సిద్ధాంతాన్ని వెరవకుండా అమలు చేసే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
చౌటుప్పల్, మే 1 : డాక్టర్ బీఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యంగ స్ఫూర్తిని పక్కాగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పీబీఆర్ గార్డెన్స్లో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల ముస్లిం సోదరులకు ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మినహా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ రంజాన్ను అధికారికంగా నిర్వహించలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి రంజాన్ జరుపుకోవడం అభినందనీయమన్నారు. దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వాలే ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు.
అందుకు భిన్నంగా తెలంగాణలో రంజాన్ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం 8ఏండ్లుగా రంజాన్ను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఉద్యమ సమయం నుంచే సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చేవారని గుర్తుచేశారు. పేద ముస్లింల సంతోషానికి దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. మత రాజకీయాలకు చరమగీతం పాడిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. అందరి సహకారంతో అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపామని తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు మంత్రి జగదీశ్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, ఆర్డీఓ ఎస్.సూరజ్కుమార్, ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ ఎన్.శ్రీనివాస్, తాసీల్దార్ దశరథ, మౌలాన ఖమ్రూద్దీన్, ఎండీ.బాబా షరీఫ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.