కరీమాబాద్, ఏప్రిల్ 25: ఉర్సులోని నాగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 28 ఫీట్ల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి భారీ విగ్రహ ఆవిష్క రణ మహోత్సవం కనులపండుగలా సాగింది. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివ చ్చారు. ఈవో కమల, ఆలయ ప్రధాన అర్చకులు రామశర్మ ఆధ్వర్యంలో వల్లీ దేవసేన సమేత సు బ్రహ్మణ్యే శ్వర మహా కుంభాభిషేక పూర్వక శ్రీల క్ష్మీ గణపతి స్థిర ప్రతిష్ఠాపన సహిత స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజులుగా చేపట్టిన వేడుకలు సోమవా రం ముగిశాయి.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహా న్ని గోవిందానంద సరస్వతీ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పూజలతో పా టు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఖిలా వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనా ర్దన్, కార్పొరేటర్లు పోశాల పద్మ, మరుపల్ల రవి, సిద్దం రాజు, ముష్కమల్ల అరుణ, గుండు చందన, కవి త, తేజస్వి, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, దామో దర్, ఆలయ కమిటీ చైర్మన్ తోట నర్సయ్య లిం గం, డైరెక్టర్లు పల్లె మల్లేశం, బజ్జూరి రవి, గుడి మెల్ల రాజు, వాటిక విద్యాసాగర్, గుండాల కవిత, నాయకులు పోశాల స్వామి, కర్ర కుమార్, కలకో ట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, అచ్చ వినోద్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.