యాదాద్రి, ఆగస్టు25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం స్వామివారికి నిత్యకైంకర్యాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించారు. స్వామివారి బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవమండపం లో ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలు, స్వర్ణఆభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసీఅర్చనలు చేపట్టారు. స్వామిఅమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యతిరు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయం ప్రకారం జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో అత్యం త ప్రతిష్ఠాత్మంగా జరుపుకొనే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వామివారి ఆశీర్వచనం, తీర్థ్ధప్రసాదాలు అందజేశారు.
స్వామివారి ఖజానాకు రూ.7,99,345 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,19,614, రూ.100 దర్శనంతో రూ.39,000, నిత్యకైంకర్యాలతో రూ.5,002, క్యారీబ్యాగులతో రూ.1,100, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ. 57, 500, కల్యాణకట్టతో రూ.19,800, ప్రసాద విక్రయంతో రూ.3,45,335, శాశ్వతపూజలతో రూ.36,000, వాహనపూజలతో రూ.6,300, టోల్గేట్తో రూ.680, అన్నదాన విరాళంతో రూ.8,849, సువర్ణ పుష్పార్చనతో రూ. 83,000, యాదరుషి నిలయంతో రూ. 55,620, పాతగుట్టతో రూ. 21,545 తో కలుపుకొని రూ.7,99,345 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.