హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఎంఎస్ రామచంద్రారావు
చౌటుప్పల్, సెప్టెంబర్16 : ప్రజలకు సత్వర న్యాయ సేవలందించేందుకే జూనియర్ కోర్టులు ఏర్పాటవుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్ రామచంద్రారావు అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘీక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టును జిల్లా ప్రొటోకాల్ జడ్జి అభినందన్కుమార్ శావలి, హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్రెడ్డి, షమీ అక్తర్, వినోద్తో కలిసి వర్చువల్ పద్ధతిలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కక్షిదారులకు దూరభారం తగ్గించడంతోపాటు సత్వర న్యాయ సేవలందించేందుకు ఈకోర్టు ఉపయోగపడుతుందన్నారు. చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, భూదాన్పోచంపల్లి మండలాల కక్షిదా రులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
జస్టిస్ టు డోర్ స్టెప్ : ఉమ్మడి జిల్లా జడ్జి మద్దిరాల వెంకటరమేశ్
ఆక్సిస్ టు జస్టిస్, జస్టిస్ టు డోర్ స్టెప్ నినాదంతో కోర్టును నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా జడ్జి మద్దిరాల వెంకట రమేశ్ అన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2,900 కేసులు ఈ కోర్టుకు బదిలీ అవుతున్నాయని తెలిపారు. ఈ కేసులకు తగ్గట్టుగా కోర్టును నిర్వహించి ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్నారు. ప్రతి శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వారానికి ఒక్కరోజు చౌటుప్పల్లో కోర్టు నడుస్తుందని తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ఇన్చార్జి జూనియర్ జడ్జి విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో రెగ్యులర్ జడ్జి వస్తారని అన్నారు. ఇక్కడ మరో జూనియర్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతించిందని, కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన కోర్టుల్లో జనం భాగస్వామ్యం ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ అదనపు న్యాయమూర్తి నాగరాజు, చౌటుప్పల్ జూనియర్ కోర్టు ఇన్చార్జి జడ్జి తులసి దుర్గారాణి, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, లీగల్ సెల్ చైర్మన్ వేణు, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలమోని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాల్యం వెంకటాచలపతి, ఉపాధ ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్గౌడ్, జాయింట్ సెక్రటరీ తాడూరి పరమేశ్ పాల్గొన్నారు.