ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదాద్రి, అక్టోబర్13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మకు పూర్వ వైభవం వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పండుగలు, సంస్కృతులకు మంచిరోజులు వచ్చాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో ఆమె బతుకమ్మ పేర్చి సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రకృతి ఒడిలో లభ్యమయ్యే ఔషద పూల కలయికే బతుకమ్మ అని, తెలంగాణలో పూల పండుగగా జరుపుకునే బతుకమ్మను ప్రతి ఒక్కరూ అనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్నారు. అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఈఓ కార్యాలయం ప్రాంగణం, యాదగిరి గుట్ట పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి.