ఆలేరురూరల్, ఆగస్టు8: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. మండలంలోని గొలనుకొండలో పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతికి ముందు గ్రామంలో ఎక్క డ పడితే అక్కడ చెత్తాచెదారం.. రోడ్లపై మురుగు నీరు పారుతూ అసౌకర్యంగా ఉండేది. నేడు అన్ని వీధుల్లో సీసీ రోడ్లతోపాటు మురుగు కాల్వలను నిర్మించడంతో గ్రామంలో స్వచ్ఛత ఏర్పడింది. పల్లెప్రగతి నిధులతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, రైతువేదిక భవనం, నర్సరీ, పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ కొనుగోలు చేసి ట్రాక్టర్, ట్రాలీతో గ్రామంలో వివి ధ పనులు చేపడుతున్నారు. పారిశుధ్య కార్మికులు ప్రతి రోజూ ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. అదేవిధంగా హరితహారంలో భా గంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని పోస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా మరమ్మతులు చేయించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతున్నది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గ్రామాభివృద్ధికి అధికారులు, పాలకవర్గ సభ్యులు, స్థానికులు సహకరిస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా మంజూరు చేస్తున్న నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలు పల్లె ప్రగతి కార్యక్రమంతో
-బైరపాక లక్ష్మి, సర్పంచ్ గొలనుకొండ
పల్లె ప్రగతిలో భాగంగా నిర్దేశించిన పనులను పూర్తిచేస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడింది. ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశాం. మండల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నాం.
గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతున్నాం. పిచ్చి మొక్కల ను తొలగించి దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ చేస్తున్నాం. పల్లె ప్రగతి పను ల్లో గ్రామస్తుల సహకారం బాగుంది.
పల్లెప్రగతి కార్యక్రమంతోనే మా గ్రామంలో అభివృద్ధి జరిగింది. గ్రామానికి కావాల్సిన నిధులు వచ్చాయి. ప్రభుత్వం గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతోనే అభివృద్ధి సాధ్యమైంది.
-తండా మైసయ్య , ఉప సర్పంచ్ గొలనుకొండ