బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపనతో పాటు ఉష్ట్రం (ఒంటె) ప్రతిష్టా మహోత్సవాలు శుక్రవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ వేడుకల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాపన పూజల్లోభాగంగా తొలి రోజు ఆరాధాన, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శేషశైలాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందాస్ హాన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అద్యక్షుడు రాములు హాన్, నల్ల శివ మాదిగ, రాంజీ హాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.