హయత్నగర్ : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా మృతిచెందిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా, చిన్నగుట్టపాలెం మండలానికి చెందిన తప్పెట అలివేలు (36), భర్త కిష్టయ్య, పిల్లలకు నాలుగేండ్లుగా దూరంగా ఉంటూ హయత్నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్నగర్ కాలనీలో నివాసముంటుంది.
స్థానికంగా అలివేలు కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తూ అక్కడే ఉంటున్న రాజుతో సహజీవనం చేస్తుంది. ఆదివారం తన మేనత్త ఇంటికి వెళ్లిన అలివేలు సోమవారం ఉదయం బంజారాకాలనీలోని వాటర్ డ్రైన్లో మృతిచెంది కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బుగ్గయ్య, ఏఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి గుర్తించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళను హత్య చేసి ఇక్కడ పడేశారా.?, ఆమె ఆత్మహత్య చేసుకున్నదా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.