దేవరకద్ర రూరల్, జనవరి 16 : క్రీడల్లో గెలుపోటములు సహజమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని గోపన్పల్లిలో ఆదివారం నిర్వహించిన వాకిటి శేషు, వాకిటి మహేశ్ స్మారక జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టోర్నీలో మొ త్తం 32జట్లు పాల్గొనగా, దేవరకద్ర మొదటిస్థానంలో, వర్నె జట్టు ద్వితీయస్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకొని క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. గ్రామీణ యువత జాతీయ, అంతర్జాతీయస్థాయి టో ర్నీల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నపూర్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
క్రికెట్ కిట్లు పంపిణీ
భూత్పూర్, జనవరి 16 : మండలంలోని కప్పెట, దేవరకద్రకు చెందిన యువకులకు అన్నాసాగర్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, నాయకులు నర్సింహులు, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.