బడంగ్పేట : పసి మనసుల హృదయాలను గాయపర్చుతూ తీన్మార్ మల్లన్న పైశాచిక ఆనందం పొందుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అల్మాస్గూడ తిరుమల్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడ కుండా ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడటం దురదృష్ట కరమన్నారు. వ్యక్తిగత విమర్శ లు చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలలోకి కుటుంబ సభ్యులను, చిన్న పిల్లలను లాగడం మంచిది కాద న్నారు. ఇది ఎక్కడి సంస్కృతి అని నిలదీశారు. ఇలాంటి వాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
బాధ్యత మర్చిపోయి సంస్కార హీనులుగా మారుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజల సమస్యలపై విమర్శిస్తే ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరిస్తామన్నారు. ఏమీ తెలియని పిల్లల గురించి మాట్లాడటం మూర్కత్వం అన్నారు. ప్రజలు ఇలాంటి విషయాలను గమనించాలని ఆమె కోరారు.
సోషల్ మీడియా వేదికగా ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారను కోవడం సరికాదన్నారు. అలాంటి వారికి ప్రజలు తగిన బుద్ది చెప్తారని ఆమె అన్నారు.