ఆరెపల్లి నుంచి గట్టమ్మ వరకుఅభివృద్ధికి నిధులు
29.6 కిలోమీటర్ల మేర ఫోర్లేన్
రెండు వైపులా తొమ్మిది మీటర్ల వెడల్పుతో బీటీ
కటాక్షపురం వద్ద హైలెవల్ వంతెన
టెండర్ల ప్రక్రియకు కసరత్తు
వరంగల్రూరల్, ఏప్రిల్ 8 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి(ఎన్హెచ్-163)లో మిగిలి ఉన్న 29.6 కి.మీ రోడ్డును ఫోర్లేన్ గా నిర్మించాలనే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 254.82 కోట్లు మంజూరు చేసింది. ఎన్హెచ్-163లో హైదరాబాద్ నుంచి 150వ కి.మీ వరకు అంటే వరంగల్ నగర శివారులోని ఆరెపల్లి వరకు కేంద్రప్రభుత్వం ఎన్హెచ్ ఏకు కేటాయించింది. దీంతో హైదరాబాద్ నుంచి ఆరెపల్లి వరకు రెండు విడుతల్లో ఫోర్లేన్గా అభివృద్ధి చేస్తుండగా, ఇంకా పనులు జరుగుతున్నా యి. 159 నుంచి 165.4 కి.మీ వరకు అంటే ఆత్మకూ రు మండలంలోని గూడెప్పా డ్ నుంచి నీరుకుళ్ల క్రాస్ వరకు 6.4 కి.మీ, ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్ట మ్మ టెంపు ల్ నుంచి గోవిందరావుపేట మండలంలోని పస్రా వరకు దాదాపు 29 కి.మీ ఫోర్లేన్ రహదారిగా నిర్మించారు. మొత్తం 35.4 కి.మీ మధ్యలో డివైడర్, రెండు వైపులా 9 మీటర్ల వెడల్పుతో బీటీరోడ్డు, పలు గ్రామా ల వద్ద రహదారికి ఇరువైపులా డ్రెయిన్, ఫుట్పాత్లు నిర్మించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. ఆరెపల్లి నుంచి గూడెప్పాడ్, నీరుకుళ్ల క్రాస్ నుంచి గట్టమ్మ టెంపు ల్ వరకు 29.6 కి.మీ రోడ్డు ఫోర్లేన్ కాకుండా మిగిలి ఉంది. ఇది కేవలం 10 మీటర్ల వెడల్పుతో డబుల్ రోడ్డుగానే ఉండ డం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా రు. నీరుకుళ్లక్రాస్- గట్టమ్మటెంపుల్ మధ్య న ఆత్మకూరు మండలంలోని కటాక్షపురం వద్ద లో లెవల్ వంతెన ఉంది. గత వానకా లం ఈ వంతెన మీదుగా కటాక్షపురం చెరు వు మత్తడి పోయడంతో కొన్ని రోజులపాటు ఎన్హెచ్పై రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఎట్టకేలకు పచ్చజెండా
ఆరెపల్లి నుంచి గూడెప్పాడ్, నీరుకుళ్ల క్రాస్ నుంచి గట్టమ్మ టెంపుల్ వరకు ఫోర్లేన్, కటాక్షపురం వద్ద హైలెవల్ వంతెన నిర్మించాలనే ప్రతిపాదన చాలా ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊ పింది. ఆరెపల్లి (150) నుంచి గూడెప్పాడ్ (159), నీరుకుళ్లక్రాస్ (165.4) నుంచి గట్టమ్మటెంపుల్ (186) వరకు మొత్తం 29.6 కి.మీ ఫోర్లేన్ రోడ్డు నిర్మిం చేందుకు రూ.254.82 కోట్లతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇందులో ఫోర్లేన్ రోడ్డుకు రూ.131.23 కోట్లు, కల్వర్టులకు రూ.13.26 కోట్లు, మైనర్ బ్రిడ్జి లకు రూ. 32.21 కోట్లు, మేజర్ బ్రిడ్జిలకు రూ.13.99 కోట్లు, డ్రెయిన్ కం ఫుట్పాత్ల కు రూ.15.97 కోట్లు, బస్షెల్టర్లకు రూ.40 కోట్లు, రోడ్సేఫ్టీ పనులకు రూ. 17.39 కోట్లు, హైవే లైటింగ్కు రూ.3.07 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆరెపల్లి నుంచి గూడెప్పాడ్, నీరుకుళ్ల క్రాస్ నుంచి గట్టమ్మ టెంపుల్ వరకు మధ్యన ఒకటిన్నర మీటరు నుంచి మూడున్నర మీటర్ల వెడల్పు డివైడర్, రెండు వైపులా తొమ్మిది మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు నిర్మిస్తారు. దామెర మండలంలోని దర్గావిలేజ్, ఒగ్లాపూర్, ఊరుగొం డ, గూడెప్పాడ్ జంక్షన్, కటాక్షపురం, ములుగు మండలం మహ్మద్గౌస్పల్లి, మల్లంపల్లి, జాకారం గ్రామాల వద్ద ఎన్హెచ్కి రెండు వైపులా మొత్తం 6.8 కి.మీ పొడవునా ఆర్సీసీ డ్రెయిన్, ఫుట్పాత్ నిర్మాణం చేపట్టనున్నారు. కొన్ని చోట్ల సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తారు. ఫోర్లేన్ రోడ్డులో నిర్మించే రెండు మేజర్ వంతెనల్లో కటాక్షపురం హైలెవల్ వంతెన ఒకటి. ఈ ఫోర్లేన్ రోడ్డు నిర్మాణం జరిగితే హైదరాబాద్ నుంచి పస్రా వరకు పూర్తిగా ఫోర్లేన్ రోడ్డు సౌకర్యం ఏర్పడనుంది. పస్రా తర్వాత ఏటూరునాగారం మీదుగా భూపాలపట్నం వరకు డబుల్రోడ్డు ఉంటుంది. నిధులు మంజూరు కావడంతో 29.6 కి.మీ ఫోర్లేన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అది పూర్తికాగానే అగ్రిమెంటు చేసుకుని పనులు ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు పదవీగండం: మే 2 తర్వాత మార్పు తప్పదా?
జియో ఫైబర్ గుడ్న్యూస్: అదేంటంటే..!