న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ఫైబర్ కస్టమర్లకు తీపి కబురందించింది. నెలవారీ ప్లాన్కు బదులు వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకున్న తమ యూజర్లకు అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు జియో ఫైబర్ పేర్కొంది.
వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరునెలల ప్యాకేజీపై 15 రోజుల వ్యాలిడిటీని జియో ఫైబర్ అదనంగా అందిస్తున్నది. నెలవారీగా రూ.399 బేస్ ప్లాన్ కోసం జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్న కానీ, వార్షిక ప్లాన్ కు అప్ గ్రేడ్ అయిన వ్యాలిడిటీ 395 రోజులకు పెరగనున్నదని జియో ఫైబర్ వెల్లడించింది. అలాగే ఆరు నెలల ప్లాన్లపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్లకు వర్తించనున్నది.
ఈ ఆఫర్ జియోఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999, రూ.8,4999 నెలవారీ ప్రణాళికలకు వర్తిస్తుంది.
ఈ ప్లాన్ గల వినియోగదారులు 12 నెలల పాటు కొనుగోలు చేస్తే 30 రోజుల అదనపు డేటాను పొందవచ్చు. అలాగే యూజర్లు.. జియోఫైబర్ సెమీ-వార్షిక ప్యాక్లను కొనుగోలు చేస్తే ఆరు నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజులు అదనంగా డేటా ఇస్తుంది.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్కార్ట్ డీల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్