కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతోవరంగల్కు పూర్వవైభవం
త్వరలో ‘మేడిన్ వరంగల్’ బాండ్ ఉత్పత్తులు
పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోవేగంగా పనులు
దసరా వరకు మొదలుకానున్న ఉత్పత్తి
ఆరు నెలల్లో ప్రొడక్ట్స్ ప్రారంభించనున్నట్లు యంగ్వన్ సంస్థ వెల్లడి
అదే బాటలో మరికొన్ని కంపెనీలు
12 వేల మందికి దొరకనున్న ఉపాధి
వరంగల్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వస్త్ర పరిశ్రమ రంగంలో చారిత్రక వరంగల్ పూర్వవైభవం సంతరించుకోనుంది. వరంగల్ను వస్త్ర ఉత్పత్తి పరిశ్రమల కేంద్రంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కును నగరం సమీపంలో నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు 2017 లో పార్కుకు శంకుస్థాపన చేయగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో మెగా టెక్స్టైల్ పార్కులో పనులు వేగం గా జరుగుతున్నాయి. వీటిలో కొన్ని ఉత్ప త్తి చేసే దశకు వచ్చాయి. ఇందులో వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న త్రిసూర్(తమిళనాడు), సూరత్(గుజరాత్), షోలాపూర్ (మహారాష్ట్ర)లో ఉత్పత్తి అయ్యే దుస్తులను ఈ పార్కులో నూ తయారుచేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఉత్పత్తి ప్రారంభించనున్న ‘యంగ్వన్’
సౌత్ కొరియాకు చెందిన యంగ్వన్ సంస్థ ఉత్పత్తులను ప్రారంభించేందుకు సమాయత్తమైంది. ఈమేరకు ఆరునెలల్లో వస్త్ర ఉత్పత్తులను మొదలుపెట్టనున్నట్లు సంస్థ చైర్మన్ సంగ్ కీ హక్ వెల్లడించారు. పార్కులో చేపట్టిన తమ సంస్థ స్థాపన పనులు త్వరలోనే పూర్తవుతాయని పరిశ్రమల మంత్రి కేటీఆర్తో ఈనెల 1న నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్లో సుంగ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఐదు దశల్లో పూర్తి కానుంది. యంగ్వన్ సంస్థ మొదటి దశలో ఐదు, రెండో దశలో మూడు యూనిట్లను నిర్మిస్తోంది. ఈ సం స్థ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణిలో ఉంది. యంగ్వన్ సంస్థ కర్మాగారాల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి తెలిపారు. ఈ సంస్థ కర్మాగారాల నిర్మాణం పూర్తయితే వెంటనే ప్రత్యక్షంగానే 12వేల మందికి ఉపాధి కలుగనుందని చెప్పారు.యంగ్వన్ బాటలోనే కంపెనీలు వస్తుండడంతో వరంగల్ ప్రజలకు ఉపాధి దొరుకనుంది.
వెయ్యి ఎకరాలు..ఐదు దశల్లో పనులు
సంగెం-గీసుగొండ మండలాలు కేం ద్రంగా వరంగల్ నగరానికి సమీపంలో 1,190 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు కోసం 2017, అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. పార్క్ ఆవరణలోని 60శాతం స్థలంలో వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. మిగిలిన 40శాతం విస్తీర్ణంలో మౌలిక వసతులతో పాటు టౌన్షిప్ నిర్మిస్తున్నారు. రూ.1,150 కోట్లతో ఐదు దశల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు మాస్టర్ప్లాన్ రూపొందించింది. శంకుస్థాపన జరిగిన రోజునే.. వస్త్ర ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఈమేరకు ఒప్పందం కూడా చేసుకున్నా యి. అప్పటినుంచి ఒక్కొక్కటిగా జాతీ య, అంతర్జాతీయ వస్త్ర ఉత్పత్తి సంస్థలు టెక్స్టైల్ పార్కులో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వస్తున్నాయి. 200కు పైగా యూనిట్లు స్థాపించే సామ ర్థ్యం ఉన్న పార్కులో స్పిన్నింగ్, వీవింగ్, టెక్స్టైల్, నిట్టింగ్, ఉలెన్ ఫ్యాబ్రిక్, యార్న్ డయింగ్, టవల్-షిటింగ్, ఫర్నిషింగ్, గార్మెంటింగ్, ప్రింటింగ్, రెడీమేడ్ వస్ర్తాలను ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం రూ.74వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఏర్పాటవుతున్న కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కలుగనుంది.
ఇవి కూడా చూడండి..
జవాన్ల మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కామారెడ్డి ట్రస్మా అధ్యక్షుడు