వరంగల్చౌరస్తా/గిర్మాజీపేట/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, అక్టోబర్ 1: జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, అర్చకులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి విశేష పూజలు అందిస్తున్నారు. వరంగల్ 41వ డివిజన్ విశ్వనాథకాలనీ జై భవాణి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వేముల క్రాంతికుమార్, భూపాల్, కర్నె రవీందర్, మేరుగు శ్రీనివాస్, రాజేంద్ర పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, స్టేషన్రోడ్డులోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో హోమాలు, అభిషేకాలు, అర్చకులు నిర్వహించారు. ఆకారపు వారి గుడిలో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు.
శ్రీరామలింగేశ్వరాలయంలో మహిళలు కుంకుమ పూజ చేశారు. అనంతరం భక్తులకు లక్ష గాజులు వితరణ చేశారు. పిన్నవారివీధిలోని వాసవీ క్లబ్ కార్యాలయ ఆవరణలో భక్తులకు అల్పహారం అందించారు. అధ్యక్షుడు జయకుమార్, కార్యదర్శి నిర్మల, కోశాధికారి జ్యోతి, ఉపాధ్యక్షుడు పసుపతి, వైద్యనాథ్ పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్లో అమ్మవారికి కార్పొరేటర్ ముష్కమల్ల అరుణా సుధాకర్ పూజలు చేశారు. ములుగురోడ్డులోని శ్రీవాసవీమాత ఆలయంలో అమ్మవారు శ్రీమహిషాసురదేవిగా భక్తులకు దర్శనమిచారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అంచూ రి శ్రీనివాస్, ఎల్లంకి రాజయ్య-కరుణ, ఐత రమేశ్-సౌజన్య, ముక్కా జమున-విరుపాక్షం దంపతులు, కార్తీకేయశర్మ పాల్గొన్నారు. శృంగేరి శంకరమఠంలో సుదర్శన హో మం నిర్వహించారు.
సామల శశిధర్-శార్వాణి దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం సుం దర్ సత్సంగ్ నిర్వహించారు. అర్చకుడు సంగమేశ్వర జోషి పాల్గొన్నారు. కాశీబుగ్గ 19వ డివిజన్ వివేకానందకాలనీలో టీఆర్ఎస్ నాయకుడు భూక్యా మోతీలాల్నాయక్, ఝాన్సీ దంపతులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో భూక్యా శ్యామ్, పావని, క్యాతం రంజిత్, చిలువేరు పవన్, బానోత్ కిరణ్నాయక్, గాదం కొమురయ్య, క్యాతం రాజు, దాసి మధు, బిట్ల రాజు, నందం రమాదేవి, భారతమ్మ, ప్రమీల, విజయ, రజిత, సాయి, వెంకటేశ్ పాల్గొన్నారు. నర్సంపేటరోడ్డులోని శ్రీకనకదుర్గ ఆలయంలో 1016 కల్వపూలతో సోమరాతి రాధిక ఆధ్వర్యంలో లలితా పారాయణం, సహస్ర కుంకుమాభిషేకం చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకటేశ్వర్లు, ఉమారాణి పాల్గొన్నారు.
ఖానాపురం/సంగెం/గీసుగొండ/నల్లబెల్లి: ఖానాపురం మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరాలయంలో శనివారం దుర్గామాత మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అనంతరం కుంకుమ పూజ చేసి భక్తులకు అన్నదానం చేశారు. ఎస్సై తిరుపతి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంగెం మండలం కాట్రపల్లిలో సామూహిక హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. గీసుగొండతో పాటు గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో నిర్వాహకులు అన్నదానం చేశారు. నల్లబెల్లి మండలంలోని నారక్కపేటలో దుర్గామాత శనివారం భక్తులకు భద్రకాళి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా యాగశాలలో భక్తులు మహా చండీయాగం నిర్వహించారు. వనపర్తి రాజు, భాగ్యలక్ష్మి, అశోక్, కల్యాణి, వడ్లూరి రమేశ్, ఉష, శ్రీపతి యుగేంధర్, అనూష, మేరుగు ప్రసాద్, మౌనిక దంపతులు యాగంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అర్చకులు వీరభద్రాచారి, రమేశ్, అజయ్శాస్త్రి, పూర్ణిమాచారి పాల్గొన్నారు.