చెన్నారావుపేట/నర్సంపేట రూరల్, మే 11 : కూలి పనులకు వెళ్తూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని అమీన్పేట గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ద్వారకపేటకు చెందిన మిట్టపల్లి రజిత(36) పనికర గ్రామంలోని బంధువుల వద్దకు పనికి వెళ్తున్నది. అదే గ్రామానికి చెందిన బూకొండ సుధాకర్ ట్రాక్టర్కు మక్కజొన్న పట్టే మిషన్ను తగిలించుకొని కూలీలను అందులో ఎక్కించుకుని వెళ్తుండగా మిషన్ బోల్తా పడింది. మిషన్పై కూర్చున్న కూలీలు కిందపడ్డారు. రజితపై మిషన్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.
పలువురి కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. రజితకు భర్త భాస్కర్, కూతురు, కుమారుడు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే రజిత మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, మృతురాలి కుటుంబాన్ని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు మినుముల రాజు, రామసహాయం శ్రీదేవి, టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, రామసహాయం సుధాకర్రెడ్డి పరామర్శించారు.