గీసుగొండ, మే 8: కష్టిస్తే ప్రభుత్వ ఉద్యోగ సాధనే సులువేనని, చల్లా చారిటబుల్ ట్రస్టు కోచింగ్ సెంటర్ను యువత సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎస్ఎస్ గార్డెన్లోని కోచింగ్ సెంటర్ను ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతీయువకులు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు. పార్కులో అనేక కంపెనీలు తమ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇక్కడకు రాబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శ్రీకాంత్, ప్రమోద్, సర్పంచులు పాల్గొన్నారు.
గీసుగొండ మండలంలోని హర్జ్యాతండా, అనంతారం గ్రామాల్లో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు గ్రామ దేవతలను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఆంగోత్ కవిత, అశ్విని పాల్గొన్నారు.