జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 17 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్లలో ఎన్నికల సందడి నెలకొన్నది. నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండోరోజు శనివారం 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 19 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ 2, సీపీఐ 1, కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 3, స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు చొప్పున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నిం గ్ అధికారులకు అందజేశారు. 21వ వార్డు స్థానానికి ముగ్గురు, 3, 14, 16, 20 వార్డులకు ఇద్దరు చొప్పున, 4, 5, 8, 10, 18, 27 వార్డులకు ఒక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జడ్చర్ల సీఐ వీరస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు. అభ్యర్థులకు అనుమానాలను నివృత్తి చేసేందుకు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన, స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజైన ఆదివారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
అచ్చంపేటలో 45 నామినేషన్లు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 17 : అచ్చంపేట మున్సిపాలిటీ లో రెండో రోజైన శనివారం 45 నామినేషన్లు దాఖలయ్యా యి. రిటర్నింగ్ అధికారి వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ నుంచి 25, కాం గ్రెస్ 11, బీజేపీ 7, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు వేశారు. మొదటి రోజు 4, రెండో రోజు 45 మొత్తం 49 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.