మాదన్నపేట :స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు, ఖైదీల మధ్య స్నేహపూర్వక వాలీబాల్ మ్యాచ్-2021ను చంచల్గూడ జైలులో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది హాజరై మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసుల, ఖైదీల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇరు జట్ల మద్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ పోలీస్ వాలీబాల్ జట్టు విజయం సాధించింది. అనంతరం జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్బుల ఫ్యాక్టరీ, వడ్రంగి యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ అడిషనల్ డీజీ శ్రీనివాసరావు, జైళ్లశాఖ ఐజీ రాజేశ్, సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, సంపత్, లక్ష్మిశ్రీనాథ్, రామ చంద్రం, శ్రీనివాస్ రెడ్డి, విజయ్కుమార్, ఖైదీల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.