-ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
కొందుర్గు, సెప్టెంబర్ 17 : డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చెర్కుపల్లి పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో గురుకుల పాఠశాలలకు ఎంపిక కావడంతో వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వనాథ్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, ఎంపీడీవో ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
జీవనోపాధికి రుణాల మంజూరు
కొందుర్గు, సెప్టెంబర్ 17 : గ్రామాల్లోని పేదలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నిధులతో మహిళలు వ్యాపారం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన దుర్బాన, జైబూన్, కొందుర్గుకు చెందిన మంజుల, తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు ఒక్కోక్కరికీ రూ.లక్ష చొప్పున మంజూరైనట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు అనుసూజ, సీసీ లక్ష్మి, జయ, నాయకులు రామకృష్ణ, హఫీజ్, మాణెయ్య, నర్సింహారెడ్డి, జహంగీర్, యాదయ్య పాల్గొన్నారు.
100 శాతం టీకాను విజయవంతం చేద్దాం
షాద్నగర్, సెప్టెంబర్ 17 : కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకురావాలని, 100శాతం టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామలో టీకా పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నియంత్రిచడంలో సఫలీకృతమైందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ సాయిప్రసాద్యాదవ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.