కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో బుధవారం శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరులతో స్వామి వారి కళ్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా కొనసాగింది.
కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాలయ కమిటీ సభ్యులు వివిధ రకాల సేవలు చేసే సేవాసమితి సభ్యులకు కళ్యాణం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయి ఆధ్వర్యంలో స్వామి వార్ల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమాలు ముగిసిన అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాధములను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, చందానగర్తో పాటు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.