ఉమ్మడి జిల్లాలో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరిగింది. శ్రీమన్నారాయణుడికి అర్చకులు అభిషేకాలు, పల్లకీసేవ, ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాల్లోభక్తుల సందడి మొదలైంది. ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. భక్తులు భారీగా తరలొచ్చారు. మన్యంకొండ, శ్రీరంగాపురం, వట్టెం ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. దర్శనాల కోసం గంటల తరబడి బారులుదీరారు. వివిధ ఆలయాల్లో సైతం భక్తుల రద్దీ నెలకొన్నది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణ మార్మోగింది. వనపర్తిలోని వెంకన్న, శ్రీరంగాపురం రంగనాథ స్వామి ఆలయాలను మంత్రి నిరంజన్రెడ్డి దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. తెల్లవారుజామునుంచే వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం నుంచి భగవద్దర్శనం చేసుకుని పునీతులయ్యారు. అలాగే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరాయణ కాలంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. వనపర్తి జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.