యాదాద్రి, జనవరి21 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవోత్సవంలో తరించారు. శ్రీ లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండంంలోని ఊయలలో శయనింపు చేయించారు. స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జామున మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి ఆలయానికి రూ. 8,51,814 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారి మంత్ర గీతానుక్రమనిక పుస్తకాలు ఆవిష్కరణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి నిత్యం నిర్వహించే మంత్రాలపై ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు రూపొందించిన మంత్ర గీతానుక్రమనిక ఆగమోత్త గ్రంథం,
శ్రీవిష్ణు విజయ విళాసోత్సవం పుస్తకాలను దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం యాదాద్రి బాలాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని
బహూకరించారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 42,550
రూ.100 దర్శనం టిక్కెట్ 16,000
వేద ఆశీర్వచనం 7,800
నిత్యకైంకర్యాలు 500
ప్రచారశాఖ 8,700
క్యారీబ్యాగుల విక్రయం 8,250
వ్రత పూజలు 32,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 15,200
ప్రసాద విక్రయం 4,42,900
వాహనపూజలు 11,500
టోల్గేట్ 690
అన్నదాన విరాళం 11,200
సువర్ణ పుష్పార్చన 52,600
యాదరుషి నిలయం 43,540
పాతగుట్ట నుంచి 18,490
ఇతర విభాగాలు 1,39,094