జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్లో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు. డిసెంబర్ 11 న యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకల ప్రత్యేక ఆకర్శణగా 30 అడుగుల స్టార్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
బుధవారం యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జూబ్లీహిల్స్ క్రిష్టియన్ ఫోరం చేపడుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్ బండారి రాజ్కుమార్ పటేల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూబ్లీహిల్స్లోని 182 చర్చిలతో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వేడుకలలో 5 వేల మంది కైస్తవులకు ప్రత్యేక కానుకలు పంపిణీ చేయడంతో పాటు క్రిస్మస్ విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించే యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలలో ఆయా చర్చిల సభ్యులతో పాటు నియోజకవర్గంలోని కైస్తవులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిషప్ విద్యాసాగర్, పాస్టర్లు యేసురాజు, జోసఫ్ నాగేశ్వర్ రావు, ప్రభుదాస్, నాయకులు విజయ్ కుమార్, సంతోష్, రాకేశ్, విలియం, డేవిడ్, సామ్యుల్ రాజు, వసంత్ రావ్, యేసుదాస్, ఉదయ్ కిరణ్, శ్యామ్, బాబురావుతో పాటు పాస్టర్లు, యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.